బ్రేకింగ్

breaking
27 Jan 2023 | 16:33 IST

ఒక్క ఛాన్స్‌ ఇస్తే జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారు: లోకేశ్‌

కుప్పం: యువగళం పేరు ప్రకటించగానే వైకాపా నాయకులకు వణుకు పుట్టిందని నారా లోకేశ్‌ అన్నారు. కుప్పంలో మాట్లాడుతూ.. ‘‘ 10మంది మంత్రులు నాపై మాటల దాడికి దిగారు. ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారు. ఆ మంత్రులను ప్రశ్నిస్తున్నా.. మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి. వీధుల్లో డ్యాన్సులు వేస్తే.. క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలు రావు. ఒక్క ఛాన్స్‌ ఇస్తే జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ మూడేళ్లలో వైకాపా చేసిందేమిటి? జగన్‌రెడ్డి అంటే జాదూరెడ్డి గుర్తొస్తున్నాడు. మైసూర్‌ బోండాలో మైసూర్‌ ఉండదు. జాదూరెడ్డి జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాలు ఉండవు’’ అని లోకేశ్‌ విమర్శించారు.

మరిన్ని

తాజా వార్తలు