బ్రేకింగ్

breaking
02 Feb 2023 | 09:40 IST

ఫ్లాట్‌గా మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. గురువారం ఉదయం [9.35AM] బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30.39 పాయింట్లు స్వల్ప నష్టంతో 59,650.50 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 44.40 పాయింట్ల నష్టంతో 17,578.25 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 81.80గా ఉంది. ఇన్ఫోసిస్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్ర, టైటన్‌, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటాస్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మరిన్ని

తాజా వార్తలు