బ్రేకింగ్

breaking
02 Feb 2023 | 15:49 IST

Stock Market: మిశ్రమంగా ముగిసిన మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 224.16 పాయింట్లు లాభపడి 59,932.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.90 పాయింట్ల నష్టంతో 17,610.40 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.17గా నిలిచింది. విప్రో, హెచ్‌సీఎల్, టీసీఎస్‌, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, బ్రిటానియా షేర్లు లాభపడగా.. అదానీ పోర్ట్స్, అదానీ పవర్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, దివీస్‌ ల్యాబ్స్‌ నష్టపోయాయి.

మరిన్ని

తాజా వార్తలు