బ్రేకింగ్

breaking
02 Feb 2023 | 19:16 IST

బయటి వారిని నియమిస్తే జవాబుదారీతనం ఎలా?: ఏపీ హైకోర్టు

అమరావతి: ప్రభుత్వ సలహాదారుల నియామకంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. సలహాదారుల నియామకంపై రాజ్యాంగబద్ధతను తేలుస్తామని చెప్పింది. ఇలా నియమించుకుంటూ పోతే సంఖ్యకు పరిమితి ఏమీ ఉండదని వ్యాఖ్యానించింది. బయట నుంచి నియమితులైన వారిలో జవాబుదారీతనం ఎలా ఉంటుందని ప్రశ్నించింది. బయటి వారికి ప్రవర్తనా నియమావళి లేదని.. వారివల్ల సున్నిత సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని