బ్రేకింగ్

breaking
06 Feb 2023 | 20:54 IST

వరుస భూకంపాలు.. 2,300మందికి పైగా మృతులు

అంకారా: వరుస భూకంపాలతో తుర్కియే, సిరియా దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ ప్రకృతి విపత్తుతో ఇప్పటి వరకు 2,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో క్షతగాత్రులైనట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే మూడుసార్లు భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై 7.8,7.6,6.0గా నమోదైంది. భూకంపం దాటికి వందలాది భవనాలు కుప్పకూలాయి.

మరిన్ని

తాజా వార్తలు