బ్రేకింగ్

breaking
07 Feb 2023 | 07:12 IST

జేఈఈ మెయిన్‌ సెషన్‌- 1 ఫలితాలు విడుదల

దిల్లీ: దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/లో ఫలితాలను తెలుసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్‌- 2023 తొలి విడత పరీక్షను 8.22లక్షల మంది రాశారు. మరోవైపు, జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 12వరకు జరగనున్న విషయం తెలిసిందే.

మరిన్ని

తాజా వార్తలు