బ్రేకింగ్

breaking
07 Feb 2023 | 09:45 IST

ఊగిసలాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. సెషన్‌ ఆరంభంలో స్వల్ప నష్టాల్లో మొదలైన సూచీలు.. మళ్లీ లాభాల్లోకి చేరుకొని ఊగిసలాట ధోరణిలో కొనసాగుతున్నాయి. ఉదయం 9:40 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 35.37 పాయింట్లు నష్టపోయి 60,471.53 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7.60 పాయింట్ల నష్టంతో 17,757.00 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹82.76గా ఉంది. డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌, ఎన్టీపీసీ, రిలయన్స్‌, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ఉండగా.. పవర్‌గ్రిడ్‌, విప్రో, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని