బ్రేకింగ్
30 Mar 2023 | 16:48 IST
ఏమీ ఇవ్వని భాజపా రాష్ట్రంలో ఎందుకు?: కేటీఆర్
హైదరాబాద్: ప్రధాని మోదీ ప్రాధాన్యతలో అసలు తెలంగాణ లేదని.. అలాంటప్పుడు రాష్ట్ర ప్రజల ప్రాధాన్యత క్రమంలో మాత్రం ఆయన ఎందుకు ఉండాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం ఇచ్చేది లేదని కేంద్రంలోని భాజపా చెప్పిందన్నారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని ఆ పార్టీ రాష్ట్రంలో ఎందుకు ఉండాలన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఇవ్వనని మోదీ చెప్పారు. మెట్రో రెండో దశ, ఐటీఐఆర్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. విభజన చట్టంలోని హామీలను మోదీ అమలు చేయట్లేదు. వీటన్నింటికి రాష్ట్రంలోని నలుగురు భాజపా ఎంపీలు బాధ్యత వహించాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
- హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
- జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
- ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
- చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ