- TRENDING TOPICS
- WTC Final 2023
బ్రేకింగ్

ఏమీ ఇవ్వని భాజపా రాష్ట్రంలో ఎందుకు?: కేటీఆర్
[16:48]హైదరాబాద్: ప్రధాని మోదీ ప్రాధాన్యతలో అసలు తెలంగాణ లేదని.. అలాంటప్పుడు రాష్ట్ర ప్రజల ప్రాధాన్యత క్రమంలో మాత్రం ఆయన ఎందుకు ఉండాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం ఇచ్చేది లేదని కేంద్రంలోని భాజపా చెప్పిందన్నారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని ఆ పార్టీ రాష్ట్రంలో ఎందుకు ఉండాలన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఇవ్వనని మోదీ చెప్పారు. మెట్రో రెండో దశ, ఐటీఐఆర్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. విభజన చట్టంలోని హామీలను మోదీ అమలు చేయట్లేదు. వీటన్నింటికి రాష్ట్రంలోని నలుగురు భాజపా ఎంపీలు బాధ్యత వహించాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం
- Odisha Train Accident: ప్రమాదం జరగడానికి కారణమిదే: రైల్వే మంత్రి
- Sharwanand: మూడుముళ్లతో ఒక్కటైన శర్వానంద్-రక్షితా రెడ్డి
- Odisha Train Accident: 112 టన్నుల బరువు... 130 కి.మీ.వేగం
- Kevvu Karthik: కాబోయే సతీమణిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్
- దానివల్ల నా భర్తతో శారీరకంగా కలవలేకపోతున్నా..!
- Heart attack: శోభనం గదిలో గుండెపోటుతో నవదంపతుల మృతి
- Odisha Train Accident: ఎన్డీఆర్ఎఫ్ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..
- Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
- కదిరిలో గేట్మెన్ నిర్లక్ష్యం.. స్టేషన్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు