బ్రేకింగ్

breaking
01 Apr 2023 | 12:51 IST

‘పది’లో నిమిషం ఆలస్యం.. కారణముంటే ఓకే: బొత్స

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 3 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు(ఉ. 9:30 - మ. 12:45) పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ‘‘పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయి. ప్రత్యేక కారణం ఉంటే తప్ప నిమిషం ఆలస్యమైనా అనుమతించం. హాల్‌టికెట్‌ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. గతంలో లీకేజీ ఆరోపణలు వచ్చిన టీచర్లపై సర్క్యులర్‌ వెనక్కి తీసుకున్నాం. ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదు’’ అని బొత్స వ్యాఖ్యానించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని