బ్రేకింగ్

breaking
01 Apr 2023 | 20:02 IST

PBKS v KKR: వర్షం అంతరాయం.. పంజాబ్‌దే విజయం

మొహాలీ: కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 7 పరుగుల తేడాతో ధావన్‌ సేన గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటింగ్‌లో రాజపక్స (50) హాఫ్‌ సెంచరీ, ధావన్‌(40) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో రస్సెల్‌ (35), వెంకటేశ్‌ అయ్యర్‌ (34) దూకుడు ప్రదర్శించారు. అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డీఎల్‌ఎస్‌ పద్ధతిలో పంజాబ్‌ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని