బ్రేకింగ్

breaking
01 Apr 2023 | 23:27 IST

మార్క్‌వుడ్‌ దెబ్బకు దిల్లీ విలవిల.. లఖ్‌నవూ శుభారంభం

లఖ్‌నవూ: ఐపీఎల్‌-16 సీజన్‌లో లఖ్‌నవూ శుభారంభం చేసింది. దిల్లీపై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసింది. మేయర్స్‌ (73) అర్థశతకంతో చెలరేగాడు. దిల్లీ బౌలర్లలో ఖలీల్‌, సర్కారియా చెరో 2 వికెట్లు తీయగా.. అక్షర్‌, కుల్‌దీప్‌ తలో వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (56) అర్ధశతకం వృథా అయ్యింది. లఖ్‌నవూ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 5 వికెట్లు పడగొట్టగా.. గౌతమ్‌, బిష్ణోయ్‌ చెరో 2 వికెట్లు తీశారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని