బ్రేకింగ్

breaking
30 May 2023 | 01:35 IST

ఐపీఎల్‌-16 టైటిల్‌ విజేతగా చెన్నై

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ ఫైనల్‌ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఐదోసారి టైటిల్‌ విజేతగా అవతరించింది. అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన చివరి బంతికి విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై జట్టులో కాన్వే(47),  శివమ్‌ దూబె(32*), రహానె(27), రుతురాజ్‌(26), రాయుడు(19)  రాణించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌(96), సాహా(54), గిల్‌(39) చెలరేగి ఆడారు. 

మరిన్ని

తాజా వార్తలు