బ్రేకింగ్

breaking
30 May 2023 | 11:11 IST

మనీశ్‌ సిసోదియాకు బెయిల్‌ నిరాకరణ

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి 26న సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. తొలుత న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆ తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో ఆయనను తిహాడ్‌ జైలుకు తరలించారు.

మరిన్ని

తాజా వార్తలు