బ్రేకింగ్

breaking
30 May 2023 | 20:38 IST

భాజపాలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది: హరీశ్‌రావు

హైదరాబాద్‌: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు భాజపాలో చేరడం కష్టమేనని ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ‘‘భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ చేతులెత్తేశారు. భాజపాలో ఎవరూ చేరేలా లేరని ఈటల రాజేందర్‌కు అర్థమైంది. భారాస అంటే భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు కలవరం. కాంగ్రెస్‌ వాళ్లు పదవుల కోసం పాకులాడే వాళ్లు. దిల్లీలో ఉండే రాహుల్‌, మోదీకి పాలమూరు మీద ప్రేమ ఉంటుందా?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
 

మరిన్ని

తాజా వార్తలు