బ్రేకింగ్

breaking
01 Jun 2023 | 07:55 IST

TS: 9,210 పోస్టులు.. సెప్టెంబరులోగా రాతపరీక్షలు!

హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఆగస్టు లేదా సెప్టెంబరులో రాతపరీక్షలు నిర్వహించేందుకు గురుకుల నియామక బోర్డు కసరత్తు చేస్తోంది. గురుకుల పోస్టుల కేటగిరీలు, సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూలును త్వరలో ప్రకటించనుంది. టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల తేదీలకు అడ్డంకులు లేకుండా ఖరారు చేయనుంది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో పోస్టులకు దాదాపు 2.66 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఆయా పోస్టులకు ఓఎంఆర్‌ పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది. సెప్టెంబరులోగా పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని