బ్రేకింగ్

breaking
04 Jun 2023 | 18:36 IST

396 గ్రామపంచాయతీలకు ₹10లక్షల చొప్పున నిధులు: KCR

ఎల్లపల్లి: నిర్మల్‌ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, జిల్లాలోని 19 మండలాలకు రూ.25లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. నిర్మల్‌ జిల్లాలోని ఎల్లపల్లిలో నిర్వహించిన భారాస బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘పదో తరగతి ఫలితాల్లో నిర్మల్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖను అభినందిస్తున్నా. ఇక్కడి బాసర సరస్వతి ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకు వస్తా’’ అని కేసీఆర్ తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు