బ్రేకింగ్

breaking
04 Jun 2023 | 18:50 IST

ఒడిశా రైలు ప్రమాదం.. సీబీఐ విచారణకు సిఫారసు

దిల్లీ: ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐతో విచారణ జరిపించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే బోర్డు.. విచారణను సీబీఐకి సిఫారసు చేసినట్లు ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ దుర్ఘటనపై సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. ‘‘ఘటనాస్థలిలో సహాయ చర్యలు పూర్తయ్యాయి. పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు కూడా పూర్తి కాగా.. ఓవర్‌హెడ్‌ వైరింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది’’ అని మంత్రి వివరించారు.

మరిన్ని

తాజా వార్తలు