బ్రేకింగ్

breaking
19 Sep 2023 | 07:17 IST

ఉదయాన్నే ఫోన్‌ చూస్తున్నారా...

ఒత్తిడి పెంచవచ్చు: ఉదయం పూట తమ ఫోన్‌లో నోటిఫికేషన్‌లు, ఈ-మెయిల్‌లు, సోషల్‌ మీడియా అప్‌డేట్‌లలో వచ్చే సందేశాల వల్ల అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ మనసులో ప్రతికూలతలు పెరిగి రోజంతా ఆ ప్రభావం కనిపించొచ్చు. మానసిక ఆరోగ్యంపై: పొద్దునే లేచింది మొదలు వివిధ సమాచారం కోసం వెతకటం, వాట్సప్‌లో మేసేజ్‌లు ఇలాంటివి శోధిస్తూ ఉంటారు. ఈ ప్రభావం మానసిక స్థితిపైనా ప్రతికూలంగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. కంటి ఆరోగ్యమూ దెబ్బ తింటుంది. నిద్రలేమి: మొబైల్‌ స్క్రీన్‌ నుంచి వచ్చే బ్లూలైట్‌ ఎక్కువసేపు కంటిపై పడటం వల్ల నిద్రలేమి సమస్య ఎదురవుతుంది.

మరిన్ని

తాజా వార్తలు