దిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా(హెచ్ఎమ్ఐఎల్) తన వినియోగదార్ల కోసం సరికొత్త నిర్వహణ పథకం(మెయింటెనెన్స్ ప్రోగ్రామ్)ను తీసుకొచ్చింది. తొమ్మిది మోడళ్లలో బ్రేకులు, క్లచ్ల వంటి విడిభాగాలను మార్చుకోడానికి ఇది వీలుకల్పిస్తుంది. ఈ పథకం కింద తమ వినియోగదార్లు కారు కొన్న తొలి అయిదేళ్లలో వైపర్లు, బల్బులు, హోస్ బెల్టుల వంటి 14 భాగాలను రీప్లేస్ చేసుకోవచ్చని పేర్కొంది. ‘మా వినియోగదార్లను జీవితకాల భాగస్వాములుగా చేసుకోవడం కోసం హ్యుందాయ్ షీల్డ్ ఆఫ్ ట్రస్ట్ను ప్రవేశపెట్టామ’ని హెచ్ఎమ్ఐఎల్ డైరెక్టర్(విక్రయాలు, మార్కెటింగ్, సేవలు) తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. ఈ ప్యాకేజీని కారు కొనుగోలు సమయంలో లేదా తొలి ఉచిత సర్వీసు కంటే ముందు తీసుకోవచ్చని వివరించారు.
ఇవీ చదవండి...
6 ఎయిర్బ్యాగ్లతో టాటా సఫారీ..ధర ఎంతంటే?
Tags :
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?