ముంబయి: దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు డీలాపడ్డాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 14,300 దిగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.28గా ఉంది.
ఉదయం 49వేల పాయింట్ల పైన ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఒకానొక దశలో 600 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్.. చివరికి 470.40 పాయింట్ల నష్టంతో 48,564.27 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 152.40 పాయింట్ల నష్టంతో 14,281.30 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో యూపీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, హిందాల్కో, సన్ఫార్మా షేర్లు నష్టాలు చవిచూశాయి. అన్ని రంగాల షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి.
ఇవీ చదవండి..
భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు
చైనాకు ట్రంప్ చివరి ఝలక్!
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?