సెన్సెక్స్ 51,000+..
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పరిణామాలకు తోడు మెటల్, ఎనర్జీ షేర్ల అండతో సూచీలు లాభాలను చవిచూశాయి. దీంతో సెన్సెక్స్ మరోసారి 51వేల మార్కును దాటగా.. నిఫ్టీ 15,100కు కొద్ది దూరంలో ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.42గా ఉంది.
ఉదయం 51,211 వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు కొనసాగించింది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా లాభాల్లోకి వెళ్లిన సూచీ చివరికి 257.62 పాయింట్ల లాభంతో 51,039.31 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 115.35 పాయింట్ల లాభంతో 15,097.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో కోల్ ఇండియా, యూపీఎల్, అదానీ పోర్ట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎల్అండ్టీ, టైటాన్ కంపెనీ, దివీస్ ల్యాబ్స్ షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఎఫ్ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి.
ఇవీ చదవండి..
పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించొచ్చు: ఆర్బీఐ
కీలక మైలురాయి దాటిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. సర్, నేను రూ . 1.50 కోటి బీమా హామీ తో టర్మ్ పాలసీ తీసుకున్నాను. 40 ఏళ్ళ పాలసీ, ప్రీమియం రూ. 24,650. దీని బదులు ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. 10 ఏళ్లలో ఏడాదికి రూ. 54,600 కడితే చాలంటున్నారు. సలహా ఇవ్వండి.
-
Q. నా పేరు ప్రదీప్, నిజామాబాదు వాసిని. నేను మే 2017 నుంచి కోటక్ స్టాండర్డ్ మల్టీ కాప్, ఎల్ అండ్ టీ మిడ్ కాప్ ఫండ్ లో రూ. 3000 చొప్పున సిప్ చేస్తున్నాను. గత 6 నెలలుగా ఎల్ & టీ మిడ్ కాప్ ఫండ్ రాబడి తగ్గుతూ ఉంది. ఇందులో కొనసాగాలా లేదా మారమంటారా?
-
Q. నా పేరు ప్రదీప్, నిజామాబాదు నివాసిని.నా నెలసరి జీతం రూ. 40 వేలు. గత నెలలో నేను రూ. 1.5 కోటి బీమా హామీ గల ఐసీఐసీఐ టర్మ్ పాలసీ తీసుకున్నాను,ప్రీమియం రూ. 24,064. ఇది మంచిదేనా?