ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి ఉదయమే తేరుకున్న మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. అయినప్పటికీ.. కీలక రంగాల మద్దతు లభించడంతో కొంత సానుకూలంగా కదలాడాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం సూచీలపై ప్రభావం చూపింది. ఉదయం సెన్సెక్స్ 50,104 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. నిఫ్టీ 14,782 వద్ద ఆరంభమైంది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఓ దశలో సెన్సెక్స్ 49,666 వద్ద, నిప్టీ 14,655 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకాయి. కానీ లోహ, స్థిరాస్తి, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల మద్దతుతో వెంటనే కోలుకుని సెన్సెక్స్ 50,316 వద్ద, నిఫ్టీ 14,849 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరాయి. తిరిగి అమ్మకాల ఒత్తిడి ఎదురవడంతో చివరకు సెన్సెక్స్ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 49,751 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్లు ఎగబాకి 14,707 వద్ద స్థిరపడింది. మొత్తంగా ఈరోజు ఈరోజు సూచీలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.46 వద్ద నిలిచింది.
బ్యాంకింగ్, ఆర్థిక, టెలికాం మినహా మిగిలిన రంగాల సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా లోహ రంగ సూచీ 3.71 శాతం లాభపడగా.. స్థిరాస్తి, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు రెండు శాతానికి పైగా ఎగబాకాయి. ఇక టాటా స్టీల్, టాటా మోటార్స్ లిమిటెడ్, ఓఎన్జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, యూపీఎల్ షేర్లు లాభాలను ఒడిసిపట్టగా.. కొటాక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ ఇండియా, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?