ఇంటర్నెట్ డెస్క్: భారత్లో మొబైల్ వినియోగదారుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ (ఎంఈ) పేరుతో ఎయిర్టెల్ భాగస్వామ్యంతో ఈ ఆఫర్ తీసుకొచ్చింది. జనవరి 13 తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ ఆఫర్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ఆఫర్ 30 రోజుల పాటు ఉచితంగా ట్రయల్ చెయ్యొచ్చు. తర్వాత రూ.89తో రీఛార్జ్ చేసుకుంటే 6జీబీ డేటాతో 28 రోజుల పాటు స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్డీ) వీడియో క్వాలిటీతో అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఆస్వాదించొచ్చు. మొబైల్ సింగిల్ యూజర్స్ కోసం ఈ ప్లాన్ తీసుకొచ్చినట్లు అమెజాన్ తెలిపింది. నెట్ఫ్లిక్స్ అందిస్తున్న రూ. 199 మొబైల్ ప్లాన్కు పోటీగా ఎయిర్టెల్ ఈ ఆఫర్ను తీసుకొచ్చింది.
ఇదే కాకుండా ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్స్ కోసం మరో ఆఫర్ కూడా ప్రకటించింది. ఇందులో రూ. 131తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల పాటు ఒకరి కన్నా ఎక్కువ మంది యూజర్స్ ఉపయోగించుకోవచ్చు. అలానే మొబైల్, టీవీ రెండింటిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడొచ్చు. కానీ అమెజాన్ ప్రైమ్ నెలవారీ సబ్స్క్రిప్షన్ను రూ. 129కే అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్స్ రూ.349తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటితో 2జీబీ రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్తో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ లభిస్తుంది. అలానే రూ. 299తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటితో 1.5జీబీ రోజువారీ డేటాతో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు.
ఇవీ చదవండి..
డిజిటల్ రుణాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం
CES 2021: శాంసంగ్ ప్రాసెసర్..గేమింగ్ ఛైర్
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?