దిల్లీ: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ సరికొత్త మైలురాయిని అందుకుంది. మూడున్నర దశాబ్దాలుగా ద్విచక్రవాహన తయారీలో నిమగ్నమై ఉన్న ఈ సంస్థ ఇప్పటి వరకు 10 కోట్ల వాహనాలను తయారు చేసి రికార్డు సృష్టించింది. హరిద్వార్లోని ప్లాంట్లో తన ఎక్స్ట్రీమ్ 160ఆర్ మోడల్ను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే ఉత్సాహంతో ఏటా 10 కొత్త ఉత్పత్తులను రానున్న ఐదేళ్లలో తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది.
1984 జనవరి 19న హీరో మోటోకార్ప్ ఉత్పత్తిని ప్రారంభించింది. 1994 నాటికి 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసింది. 2013 నాటికి ఆ సంఖ్య 5 కోట్లకు, 2017 నాటికి 7.5 కోట్ల చేరింది. కేవలం గడిచిన ఏడేళ్లలోనే 5 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేశామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఇది మా కష్టానికి తగ్గ ప్రతిఫలం’ అని ఈ సందర్భంగా ఆ కంపెనీ ఛైర్మన్ అండ్ సీఈవో పవన్ ముంజల్ అన్నారు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా తమ వాహనాలకు మంచి గిరాకీ ఉండటంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. భారత్ సహా మొత్తం 40 దేశాల్లో హీరో మోటోకార్ప్ తన వాహనాలు విక్రయిస్తోంది. కేవలం ఒక్క భారత్లోనే 8 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది.
ఇదే ఉత్సాహంతో రాబోయే ఐదేళ్లలో మరిన్ని కొత్త ఉత్పత్తులు తీసుకొస్తామని ముంజల్ ప్రకటించారు. అలాగే పరిశోధన, అభివృద్ధిపై (ఆర్అండ్డీ) మరింత దృష్టి సారించనున్నామని తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కృషి చేస్తూ పర్యావరణహిత ఉత్పత్తులను తీసుకొస్తామని చెప్పారు. 10 కోట్ల మైలురాయిని అందుకున్న సందర్భంగా స్పెషల్ సెలబ్రేషన్ ఎడిషన్ మోడళ్లను గురుగ్రామ్ తయారీ ప్లాంట్లో గురువారం ఆయన ఆవిష్కరించారు. స్ప్లెండర్+, ఎక్స్ట్రీమ్ 160ఆర్, ప్యాషన్ ప్రో, గ్లామర్, డెస్టినీ 125, మ్యాస్ట్రో ఎడ్జ్ 110క స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేశారు. ఫిబ్రవరి నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ఇవీ చదవండి..
ద్విచక్ర వాహన బీమాను బదిలీ చేయడం ఎలా?
బ్యాంక్ పేరుతో వచ్చే ఫేక్ మెసేజ్లను గుర్తించడం ఎలా?
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?