ముంబయి: సోమవారం నాటి నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. మంగళవారం ఉదయం 9:39 గంటల సమయంలో సెన్సెక్స్ 374 పాయింట్లు లాభపడి 49,438 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 14,386 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.11 వద్ద కొనసాగుతోంది. చైనా వృద్ధి రేటు మెరుగుపడడం ప్రాంతీయంగా కలిసొచ్చే అవకాశం ఉందన్న సంకేతాలతో ఆసియా మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా మరోసారి కొవిడ్ విజృంభణ, లాక్డౌన్ భయాలు వెంటాడుతున్నప్పటికీ.. చైనా వృద్ధి రేటు మదుపర్లలో ఆశలు రేకెత్తిస్తోంది.
బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాలు ఒక శాతానికి పైగా లాభాల్లో పయనిస్తున్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ లిమిటెడ్, ఓఎన్జీసీ, గెయిల్, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..యూపీఎల్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?