ఓక్లాండ్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ వ్యక్తిగత గోప్యతా విధానం వివాదంగా మారడం మిగతా యాప్లకు సంబరంగా మారింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్లో సిగ్నల్, టెలిగ్రాం యాప్ల డౌన్లోడ్లు విపరీతంగా పెరిగాయి. జనవరి 5 నుంచి 12 మధ్య గూగుల్, యాపిల్ స్టోర్ల నుంచి సిగ్నల్ యాప్ను 17.8 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని మొబైల్ యాప్ అనలిటిక్స్ సంస్థ సెన్సర్ టవర్ తెలిపింది. అంతకు ముందు వారంలోని 2,85,000 డౌన్లోడ్లతో పోలిస్తే ఇది 61% పెరుగుదల కావడం గమనార్హం.
సిగ్నల్ తరహాలోనే టెలిగ్రాం యాప్కూ గిరాకీ పెరిగింది. జనవరి 5 నుంచి 12 మధ్య 15.7 మిలియన్ల డౌన్లోడ్లు నమోదయ్యాయి. అంతకుముందు వారం 7.7 మిలియన్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. ఇక వివాదానికి కేంద్ర బిందువైన వాట్సాప్కు అంతకు ముందువారం 12.7 మిలియన్ల డౌన్లోడ్లు ఉండగా జనవరి 5-12 మధ్య 10.6 మిలియన్లకు తగ్గాయి. ఇదంతా చూస్తుంటే సంప్రదాయ సోషల్ మీడియా వినియోగదారులు ఫేస్బుక్, ట్విటర్కు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
తాము తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతోన్న తరుణంలో మంగళవారం మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరోసారి స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిన సందేశాల గోప్యతను తాజాగా తీసుకువచ్చిన మార్పులు ఏ విధంగానూ ప్రభావితం చేయవని వివరించింది. కొత్త పాలసీపై చక్కర్లు కొడుతున్న వదంతులను పరిష్కరించాలని భావిస్తున్నామని వెల్లడించింది. అలాగే ఎప్పటిలాగే వినియోగదారుల సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో భద్రంగా ఉంటాయని ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది.
ఇవీ చదవండి
మీ గోప్యతకు ఏ భంగం వాటిల్లదు: వాట్సాప్
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?