
తాజా వార్తలు
ఆ వివాదంతో నా కుమార్తె బెదిరిపోయింది
ఆమె తప్పులేకపోయినా..: సునీల్ శెట్టి
ముంబయి: ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కుమార్తెగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి అతియా శెట్టి. ‘హీరో’తో అరంగేట్రం చేసిన ఆమె 2017లో ‘ముబారకన్’, 2019లో ‘మోటిచూర్ చక్నాచూర్’ సినిమాల్లో కనిపించారు. అతియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ జంటగా నటించిన ‘మోతిచూర్ చక్నాచూర్’కు దేబామిత్రా బిశ్వాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్లోకి రావడానికి ముందు వివాదంలో చిక్కుకుంది. దర్శకురాలికి, నిర్మాతలకు మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. అది కాస్త వివాదానికి దారి తీసింది. అంతేకాదు సునీల్, అతియాను కూడా ఇందులోకి లాగారు.
అప్పట్లో జరిగిన ఈ సంఘటనతో తన కుమార్తె అతియా శెట్టి బెదిరిపోయిందని సునీల్ శెట్టి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అతియాకు అన్నీ నేనే. నాతో స్నేహంగా ఉంటుంది.. కొడుతుంటుంది కూడా (సరదాగా). జీవితంలో ఏది ముఖ్యమనేదానిపై అతియాకు ఎంతో స్పష్టత ఉంది. ‘మోతిచూర్ చక్నాచూర్’ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ అదే చిత్రం ఆమెను భయబ్రాంతులకు గురి చేసింది. నా కుమార్తె తప్పు లేకపోయినా.. అనవసరంగా ఆమె పేరును వివాదంలోకి లాగారు. ఇప్పుడు ఓ సినిమా తన దగ్గరికి వస్తే.. ఆందోళన చెందుతోంది. ఒకటికి 25 సార్లు ఆలోచించి, నిర్ణయం తీసుకుంటోంది’ అని ఆయన పేర్కొన్నారు.