హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్బాబు నటించనున్న సినిమాల గురించి గత కొంతకాలంగా వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని ఆయన పీఆర్వో వెల్లడించారు. మోహన్బాబు ప్రస్తుతం ‘సన్ ఆఫ్ ఇండియా’లో మాత్రమే నటిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా.. ‘కలెక్షన్ కింగ్ మోహన్బాబు.. ప్రస్తుతానికి ‘సన్ ఆఫ్ ఇండియా’ ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు. ఆయన ఏ ఇతర ప్రాజెక్ట్కు ఇంకా సంతకం చేయలేదు. ఆయన చేయనున్న సినిమాల గురించి వస్తోన్న వార్తలను ఎవరూ నమ్మకండి. ఒకవేళ ఆయన ఏదైనా ప్రాజెక్ట్ను ఓకే చేసి ప్రకటిస్తే.. మేము మీకు తెలియజేస్తాం’ అని ట్వీట్ చేశారు.
మోహన్బాబు కొన్ని భారీ ప్రాజెక్ట్లలో నటించనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’ ఒకటి. ఇందులో మోహన్బాబు ఓ కీలకపాత్ర పోషించనున్నారంటూ పలు కథనాలు వచ్చాయి. అయితే సదరు వార్తలపై మోహన్బాబు కానీ, చిత్రబృందం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
ఇదీ చదవండి
మహేశ్బాబు అందానికి రహస్యమదే: విష్ణు
మరిన్ని
కొత్త సినిమాలు
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
-
సందడి చేస్తోన్న ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
-
‘మహా సముద్రం’లో శర్వానంద్ ఇలా..!
-
తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!
గుసగుసలు
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
రివ్యూ
ఇంటర్వ్యూ
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్తరుణ్
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
కొత్త పాట గురూ
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని