హైదరాబాద్: పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ సంక్రాంతి భలే కానుకలను తీసుకొచ్చింది. గురువారం ‘వకీల్సాబ్’ టీజర్ అదరగొట్టగా.. తాజాగా పవన్ తర్వాతి సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ చిత్ర బృందం విడుదల చేసింది. యువ కథానాయకుడు రానాతో కలిసి ఆయన ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, సంభాషణలు అందించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, చిత్ర బృందం శుక్రవారం ఓ వీడియోను పంచుకుంది.
మలయాళ సూపర్హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అక్కడ బిజు మేనన్, పృథ్వీరాజ్లు పోషించిన పాత్రలను ఇక్కడ తెలుగులో పవన్, రానా పోషిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో కథానాయికలుగా సాయి పల్లవి, ఐశ్వర్యరాజేశ్లు ఎంపికైనట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
-
సందడి చేస్తోన్న ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- దిశను ఓకే చేశారా?
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్ను తీసుకెళ్తోన్న బన్నీ..!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్తరుణ్
- అందుకే సీరియల్స్లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
కొత్త పాట గురూ
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని