
హైదరాబాద్: రెబల్స్టార్ ప్రభాస్ న్యూలుక్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆయన సన్నబడ్డట్టు కనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాటిలో డార్లింగ్ గత కొంతకాలంగా కనిపిస్తున్న లుక్కు భిన్నంగా, స్మార్ట్గా ఉన్నారు. కసరత్తులు చేసి మరీ కండలు తగ్గించినట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ తర్వాతి సినిమా కోసం ఈ లుక్లో సిద్ధమైనట్లు ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ శారీరకంగా మారిన తీరు ఎంతో నచ్చిందని, హ్యాండ్సమ్గా ఉన్నారని తెగ పోస్ట్లు చేస్తున్నారు. దీంతో ఫొటోలు కాస్త వైరల్గా మారాయి.
‘సాహో’ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ సినిమా తుది షెడ్యూల్ హైదరాబాద్లోని ఓ ఫిల్మ్ స్టూడియోలో ఏర్పాటు చేసిన భారీ సెట్లో జరుగుతోంది. ఇప్పటికే దర్శకుడు రాధాకృష్ణ, తదితర చిత్ర బృందం షూటింగ్ పనులు చూసుకుంటున్నారు. త్వరలోనే ప్రభాస్, పూజా హెగ్డే చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. క్లైమాక్స్ సీన్ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పోవెల్ పనిచేయనున్నారట. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఇటీవల ప్రభాస్ ‘ఆదిపురుష్’తోపాటు నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్న మరో చిత్రానికి సంతకం చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు 2021లో ఆరంభం కాబోతున్నాయి. ‘తానాజీ’ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహించబోతున్న ‘ఆదిపురుష్’ 2022 ఆగస్టు 11న విడుదల అవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో దీపికా పదుకొణె, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- అరెరె షా.. రోహిత్కు కోపం తెప్పించేశావ్గా!
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని