
తాజావార్తలు
హైదరాబాద్: విలక్షణ నటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమాలో నటించే అవకాశం కోల్పోయానని బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్వాల్ తెలిపారు. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. కాజల్, రకుల్ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కమల్ సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘భారతీయుడు’కు సీక్వెల్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
కాగా ఇందులో విద్యుత్ నటించబోతున్నారని తొలుత వదంతులు వచ్చాయి. ఆపై చిత్ర బృందం ఆయన పేరును అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఆ ఆవార్తల్లో నిజం లేదని అనుకున్నారు. అయితే తనకు సినిమాలో అవకాశం వచ్చిందని విద్యుత్ తాజాగా మీడియాతో అన్నారు. ‘తొలుత నన్ను ‘భారతీయుడు 2’లో నటించమని అడిగారు. కానీ ‘ఖుదా హఫీజ్’ చిత్రం కోసం అప్పటికే సంతకం చేశా. అందువల్లే ‘భారతీయుడు 2’లో నటించే గొప్ప అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందటూ’ అని చెప్పారు. మరోపక్క శృతి హాసన్, విద్యుత్ కలిసి ‘పవర్’ సినిమాలో నటించబోతున్నారు. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం విద్యుత్ ‘కమాండో 3’ చిత్రంలో నటిస్తున్నారు. డిసెంబర్ 29న ఈ సినిమా విడుదల కాబోతోంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- హైదరాబాద్లో విద్యార్థుల ఆందోళన
- జపాన్లో రానా బర్త్డే సెలబ్రేషన్స్
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!