
తాజా వార్తలు
నక్సల్స్ దాడిలో అమరుడైన కోబ్రా కమాండెంట్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్) బలగాలే లక్ష్యంగా మందుపాతర(ఐఈడీ) పేల్చారు. ఈ ఘటనలో అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు(33) ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లో భాగంగా తాడ్మెట్ల గ్రామంలో బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోనే ఉన్న అటవీ ప్రాంతంలో అమర్చిన ఐఈడీని నక్సల్స్ పేల్చారు.
Tags :
క్రైమ్
జిల్లా వార్తలు