
తాజా వార్తలు
మాజీ మంత్రి అఖిలప్రియ విడుదల
హైదరాబాద్: బోయిన్పల్లిలోని ప్రవీణ్రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు నిన్న బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ను సికింద్రాబాద్ న్యాయస్థానం మంజూరు చేసింది. 15 రోజులకోకసారి బోయిన్పల్లి ఠానాలో సంతకాలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆమె విడుదలవుతున్న సందర్భంగా చంచల్గూడ జైలు వద్దకు అఖిలప్రియ బంధువులతో పాటు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచి అనుచరులు భారీగా తరలివచ్చారు. దీంతో జైలు పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారింది.
హఫీజ్పేటలోని భూవివాదం నేపథ్యంలో ప్రవీణ్రావు, సునీల్ రావు, నవీన్రావు అనే ముగ్గురు సోదరుల కిడ్నాప్పై బోయిన్పల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. దీనిలో భాగంగా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..
పెరుగుతున్న వింతవ్యాధి బాధితులు