
తాజా వార్తలు
నిప్పు అంటించుకున్న భార్యను వీడియో తీసిన భర్త
జైపుర్: అత్తింట్లో వేధింపులు తట్టుకోలేక నిప్పు అంటించుకుని మంటల్లో కాలిపోతున్న భార్యను కాపాడాల్సింది పోయి, ఆ దారుణాన్ని ఫోన్లో చిత్రీకరించి ఆమె కుటుంబ సభ్యులకు పంపిన ఓ రాక్షసుడి దురాగతమిది. రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాకు చెందిన ఓ వివాహిత ఈ నెల 20న ఆత్మహత్య చేసుకోవడానికి నిప్పు అంటించుకుంది. ఒంటిని మంటలు దహించివేస్తుంటే బాధను ఓర్చుకోలేక కేకలు పెడుతున్నా అక్కడే ఉన్న భర్త కాపాడే ప్రయత్నం చేయలేదు సరికదా ఆ దృశ్యాన్ని ఫోన్లో చిత్రీకరించాడు. ఆ తర్వాత దాన్ని ఆమె తల్లిదండ్రులకు పంపాడు. పూర్తిగా కాలిన గాయాలతో ఉన్న ఆమె జైపుర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 22న మరణించింది. దీనికి సంబంధించి ఆమె భర్త, అత్తమామలపై గురువారం కేసు నమోదైంది.
Tags :
క్రైమ్
జిల్లా వార్తలు