
ప్రధానాంశాలు
నాన్నా.. చనిపోవద్దు నాన్నా
వీడియోకాల్లో కుమారులు వేడుకుంటున్నా ఆత్మహత్యకు పాల్పడిన తండ్రి
సైబర్, గొలుసుకట్టు మోసాలతో రూ.4.65 లక్షల నష్టమే కారణం
రామారెడ్డి, న్యూస్టుడే: సులువుగా డబ్బులు వస్తాయన్న ఆశ, గొలుసుకట్టు కంపెనీలో నగదు కట్టి మోసపోవడం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. చనిపోతున్నానంటూ కన్న కుమారులిద్దరికీ వీడియోకాల్ చేసి ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆ కుటుంబంలో అంతులేని వేదనను మిగిల్చింది. ‘నాన్నా.. వద్దు నాన్నా..’ అంటూ చిన్నారులు విలపిస్తూ ఎంత వేడుకున్నా ఆ తండ్రి నిర్ణయాన్ని మార్చుకోలేదు. చక్కగా ఉండాలని, బుద్ధిగా చదువుకోవాలని వీడియోకాల్లో కుమారులతో మాట్లాడుతూనే తనువు చాలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారకమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
రామారెడ్డి మండలం పోసానిపేట్కు చెందిన మంగళపల్లి లక్ష్మణ్(41), లక్ష్మి భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు తిరుపతి, ఈశ్వర్. ఆయన ఎలక్ట్రీషియన్ కాగా ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం నిమిత్తం వారు జిల్లా కేంద్రం కామారెడ్డిలో ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. ఆరు నెలల క్రితం లాటరీలో నగదు గెలుచుకున్నట్లు లక్ష్మి సెల్ఫోన్కు సంక్షిప్త సందేశాలు వచ్చాయి. నగదు పంపాలంటే కొంత మొత్తం చెల్లించాలంటూ సైబర్ నేరగాళ్లు అందులో పేర్కొన్నారు. దాంతో అప్పులు తెచ్చి మరీ రెండు విడతల్లో రూ.2.65 లక్షలు కట్టారు. కొన్ని రోజుల తర్వాత బీర్షేబా కంపెనీలోనూ విడతల వారీగా రూ.2 లక్షలను (గొలుసు కట్టు తరహా, రూ.30 వేలు కడితే రూ.లక్ష వస్తుందని నమ్మించారు) కట్టారు. తీరా ఎంతకీ నగదు రాకపోవడంతో మోసపోయామని గ్రహించి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో లక్ష్మణ్ ఆందోళనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని గురువారం స్వగ్రామం పోసానిపేటకు వెళ్లారు. అక్కడ ఉరేసుకొనే ముందు కామారెడ్డిలో ఉన్న పిల్లలకు వీడియోకాల్ చేసి మాట్లాడారు. వారు చూస్తుండగానే వద్దని వేడుకుంటున్నా బలవన్మరణానికి పాల్పడ్డారు. గొలుసుకట్టు సంస్థ మోసాలకు జిల్లాలో ఇటీవల పలువురు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యనే మాచారెడ్డి మండలంలోనూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రధానాంశాలు
సినిమా
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- ఆఫర్ కోసం చిరు, పవన్లకు కాల్ చేశా: కోట
- సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: రాజేంద్రప్రసాద్
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- జూమ్కాల్లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్కి ముందే తెలుసు
- ఐపీఎల్ 2021 భారత్లో.. అంతా బయటే
- సచిన్ వదిలేశాడు.. ధోనీ అందిపుచ్చుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
