
ప్రధానాంశాలు
కోడి కత్తికి మనిషి బలి
మర్మాంగాలకు తగలడంతో మృత్యువాత
లొత్తునూర్(గొల్లపల్లి), న్యూస్టుడే: కోడి కత్తి ప్రమాదవశాత్తూ మర్మాంగాలకు తగలడంతో వ్యక్తి మరణించిన ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం...లొత్తునూర్ శివారులో కోడి పందెం నిర్వహించడానికి స్థానికులు సిద్ధమయ్యారు. వెల్గటూరు మండలం కొండాపూర్కు చెందిన తనుగుల సతీష్ (45) కోడి ఒక కాలికి కత్తికట్టాడు. రెండో కాలికి కట్టే ప్రయత్నంలో ఉండగానే అది తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కత్తి పురుషాంగానికి, వృషణాలకు తగలడంతో అక్కడే కుప్పకూలాడు. జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!
- ఇలియానా నయా బాయ్ఫ్రెండ్ని చూశారా..!
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- గంటా వైకాపాలో చేరే అవకాశం: విజయసాయి
- డ్యాన్స్తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- ఇంట్లో తెలిసిపోతుందనే డిగ్రీ విద్యార్థిని ‘కట్టు’కథ
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
