
తాజా వార్తలు
గద్దెనెక్కే సమయం ఆసన్నమైంది: నడ్డా
హైదరాబాద్: రాష్ట్రంలో భాజపా గద్దెనెక్కే సమయం ఆసన్నమైందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపాకు పెద్ద ఎత్తున విజయం అందించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపేట నుంచి నాగోలు వరకు నిర్వహించిన రోడ్షోలో నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తోందన్నారు. రోడ్షోకు ప్రజలు భారీగా తరలివచ్చి కేసీఆర్ గద్దె దిగే సమయం ఆసన్నమైందనే సంకేతాలిచ్చారని నడ్డా వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపాను గెలిపించి హైదరాబాద్ అభివృద్ధికి మార్గం సుగమం చేయాలన్నారు. ప్రతి డివిజన్లోనూ కమల వికాసానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్షం కారణంగా రోడ్షోను మధ్యలోనే ముగించారు. అనంతరం తాజ్ బంజారా హోటల్లో నిర్వహించనున్న మేధావుల సదస్సుకు నడ్డా బయల్దేరి వెళ్లారు.
ఇవీ చదవండి..
డబ్బులు ఖర్చు చేయడమే అభివృద్ధి కాదు: కేటీఆర్
కుల సంఘాలను కేసీఆర్ మోసం చేశారు: బండి