
తాజా వార్తలు
15 నిమిషాల్లో నేర్చుకుని.. 10 నిమిషాల్లో పాడి..!
బాలు జ్ఞాపకాల్లో.. వీడియో షేర్ చేసిన రెహమాన్
చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వీడటంతో భారత చలన చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖులు సోషల్మీడియాలో మాట్లాడుతున్నారు. బాలు మరణంతో తన గుండె పగిలిందని సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయనతో కలిసి పంచుకున్న మధుర సంఘటనల్ని తెలుపుతూ.. ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ‘ఎస్పీబీ జీవితాన్ని సెలబ్రేట్ చేద్దాం..’ అని పేర్కొన్నారు.
‘చాలా ఏళ్ల క్రితం సుహాసిని మణిరత్నం.. ఎస్పీబీ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. అందులో నేను ప్రదర్శన ఇచ్చా. నేను అప్పుడప్పుడే కెరీర్ ఆరంభిస్తున్న రోజులవి. ఆ తర్వాత ‘రోజా’ సినిమా కోసం సంగీత దర్శకుడిగా పనిచేశా. ఈ చిత్రంలోని పాట రికార్డింగ్ కోసం బాలు సర్ స్టూడియో దగ్గరికి వచ్చారు. అక్కడి వాతావరణం చూసి.. ఇక్కడ మ్యూజిక్ రికార్డింగ్ చేస్తారా అని ప్రశ్నించారు. నేను నవ్వాను.. ఆపై ‘రోజా’ సినిమా విడుదల తర్వాత సర్ నా దగ్గరికి వచ్చి, సంగీతాన్ని ఎక్కడైనా సృష్టించొచ్చు అన్నారు’.
‘బాలు సర్ 15 నిమిషాల్లోనే పాటను నేర్చుకునేవారు. పది నిమిషాల్లో పాడేసేవారు. వెంటనే మరో రికార్డింగ్లోకి వెళ్లిపోయేవారు. ఇంత వేగంగా పాటలు పాడే గాయకుడ్ని, వృత్తిపట్ల నిబద్ధత ఉన్న వ్యక్తిని మళ్లీ చూడలేనేమో.. ఇప్పుడు మనమంతా కలిసి ఆయన సంగీతాన్ని, జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఎస్పీబీ సర్.. మేం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. కానీ మిమ్మల్ని కోల్పోయామని మాత్రం చెప్పను’ అని రెహమాన్ వీడియోలో అన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- సికింద్రాబాద్లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
