
తాజా వార్తలు
ఇంట్లోకి మొసలి.. జనం పరుగులు
సితార్గంజ్: ఉత్తరాఖండ్లో జనావాసాల్లోకి వచ్చిన ఓ మొసలి కలకలం సృష్టించింది. ఉదంసింగ్ నగర్లోని సితారగంజ్లో రాత్రిపూట ఓ ఇంట్లోకి మొసలి ప్రవేశించడంతో గుర్తించిన స్థానికులు పరుగులు తీశారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు దాన్ని పట్టుకొని దగ్గరలోని ఓ ఆనకట్టలో వదిలేశారు. స్థానికంగా ఉన్న నదుల్లో నీటి మట్టం పెరగడంతో మొసళ్లు ఇలా తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపారు.
Tags :