
తాజా వార్తలు
ఆప్, కాంగ్రెస్పై భాజపా బాణాలు
దిల్లీ: హస్తినలో అసెంబ్లీ సమరానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీలు విమర్శల వాడి పెంచుతున్నాయి. దిల్లీ ఎన్నికలను భారత్-పాకిస్థాన్ వివాదంతో పోల్చినందుకుగాను భాజపా నేత కపిల్ మిశ్రాకు దిల్లీ ఎన్నికల సంఘం షోకాజు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ కూడా ప్రతిపక్షాలపై నేరుగా విమర్శలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల వెనక కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీల హస్తముందని ఆరోపించారు. అక్కడ ‘జిన్నా వాలీ ఆజాదీ’ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయని, ప్రజలు జిన్నా వాలీ ఆజాదీ అంటారో.. భారత్ మాతాకీ జై అంటూ నినదిస్తారో తేల్చుకోవాలని దిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాటలను బట్టి చూస్తే షాహిన్ బాగ్లో ఆప్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అర్థమవుతోందని జావడేకర్ విమర్శించారు. వారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో వీటి తీవ్రత అధికంగా ఉంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
