
తాజా వార్తలు
గ్రేటర్లో ముగిసిన ప్రచార గడువు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. దీంతో గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో ఆయా పార్టీ అభ్యర్థుల మైకులన్నీ ఈ సాయంత్రం 6 గంటల తర్వాత మూగబోయాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. మరోసారి గ్రేటర్ పీఠం నిలబెట్టుకోవాలని అధికార తెరాస భావిస్తుండగా, ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని భాజపా కృతనిశ్చయంతో ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
డిసెంబరు 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపనున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు, పార్టీల నేతలు, కార్యకర్తలు గడువు సమయంలోపే జీహెచ్ఎంసీ పరిధిని వదిలి వెళ్లాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ రోజు (డిసెంబరు 1) సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
