
తాజా వార్తలు
గ్రేటర్పోరు: 3గంటలకు ఎంత పోలింగ్ అంటే?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు 14 డివిజన్లలో 1శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తంగా 25.34 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నగదు పంచుతున్నారంటూ భాజపా, తెరాస నేతల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సకాలంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
డివిజన్లు, సర్కిళ్లలో పోలింగ్ వివరాలు..
బేగంబజాలో 28.6 శాతం, గోషామహల్లో 16 శాతం, మంగల్ హాట్లో 19.8 శాతం, దత్తాత్రేయ నగర్లో 41.4 శాతం, జాంబాగ్లో 34.4 శాతం, గన్ ఫౌండ్రీలో 35.3 శాతం, కుత్బుల్లాపూర్లో 28.4 శాతం, గాజులరామారంలో 36.6 శాతం, సనత్నగర్లో 26.29 శాతం, అమీర్పేటలో 26.31 శాతం, హయత్నగర్ సర్కిల్లో 34.79 శాతం, చాంద్రయానగుట్టలో 15.9 శాతం, చందానగర్ సర్కిల్లో 22.55 శాతం, మాదాపూర్లో 22.70 శాతం, మియాపూర్లో 25.47 శాతం, హఫీజ్పేట్ డివిజన్లో 20.98 శాతం, చందానగర్లో 21.42, కాచిగూడలో 38.94 శాతం, నల్లకుంటలో 38.03 శాతం, గోల్నాకలో 36.34 శాతం, అంబర్పేటలో 38.59 శాతం, బాగ్ అంబర్పేటలో 64.78 శాతం, బోరబండలో 35.69 శాతం, అల్లాపూర్లో 33.43 శాతం, వెంగల్రావు నగర్లో 28.32 శాతం, రహ్మత్ నగర్లో 31.11 శాతం, ఎర్రగడ్డలో 30.55 శాతం, ఫతేనగర్లో 34.77 శాతం, సనత్ నగర్లో 26.19 శాతం, మూసాపేట్ సర్కిల్ పరిధిలోని డివిజన్లలో 34.25 శాతం, కూకట్పల్లి సర్కిల్ పరిధిలో 26.03 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్న నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నగరంలోని ఓ పోలింగ్ కేంద్రానికి ఉదయం నుంచి ఎవరూ ఓటు వేసేందుకు రాకపోవడంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇలా విశ్రాంతి తీసుకున్నారు.
ఇవీ చదవండి..
గ్రేటర్లో..పలుచోట్ల ఉద్రిక్తత
ఓల్డ్ మలక్పేటలో ఎల్లుండి రీ పోలింగ్