
తాజా వార్తలు
ఏపీలో కొత్తగా 1,160 కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 68,307 నమూనాలను పరీక్షించగా 1,160 మందికి పాజిటివ్ తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,61,092కి చేరింది. తాజాగా కరోనా మహమ్మారితో ఏడుగురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 6,927కు పెరిగింది. చిత్తూరులో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా 1,765 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జికాగా.. ఇప్పటి వరకు 8,39,395 మంది వైరస్ను జయించినట్లు పేర్కొంది. మరో 14,770 మంది వివిధ ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 95,43,177 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది.
Tags :
జనరల్
జిల్లా వార్తలు