
తాజా వార్తలు
ఎంపీ సుజనా చౌదరికి పితృవియోగం
హైదరాబాద్: భాజపా ఎంపీ సుజనా చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి జనార్ధనరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని సుజనా ట్విటర్ ద్వారా వెల్లడించారు. జనార్ధనరావు కృష్ణా జిల్లా దోసపాడులో 1932 జనవరి 9వ తేదీన జన్మించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయటంలో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనార్ధనరావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది.ఆయన మృతిపట్ల భాజపా నేతలు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Tags :
జిల్లా వార్తలు