
తాజా వార్తలు
తెలంగాణలో కొత్తగా 47 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైనవాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 40 కేసులు, రంగారెడ్డి జల్లాలో 2, మరో ఇద్దరు వలస కార్మికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు కరోనాబారిన పడిన వలస కూలీల సంఖ్య 37కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు 1,414కి చేరాయి. తాజాగా 13 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మొత్తంగా 952 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 428 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల్లో పురుషులతో పోల్చితే మహిళలు తక్కువగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంగా నమోదైన మృతుల్లో 27 మంది పురుషులు కాగా ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వారికి విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
తెలంగాణలో ఇప్పటివరకు యాదాద్రి-భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 14 రోజులుగా రాష్ట్రంలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్, వికారాబాద్, నల్గొండ, కుమరంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, వరంగల్ అర్బన్, జనగామ, జోగులాంబ గద్వాల, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.