
తాజా వార్తలు
ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు
బులెటిన్ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 51,854 నమూనాలను పరీక్షించగా 685 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,68,749కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,996కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,094 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 7,427 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,01,09,708 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
Tags :
జనరల్
జిల్లా వార్తలు