
తాజా వార్తలు
గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎందరు?
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 వార్డుల్లో మొత్తం 1122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార తెరాస 150 స్థానాల్లోనూ తన అభ్యర్థులను నిలిపింది. నవాబ్సాహెబ్కుంట తప్ప మిగతా 149 స్థానాల్లో భాజపా బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ 146, ఎంఐఎం 51 చోట్ల పోటీ చేయగా.. తెదేపా 106, సీపీఐ 17, సీపీఎం 12 చోట్ల తమ అభ్యర్థులను నిలిపింది. మొత్తం 415 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అత్యధికంగా జంగమ్మెట్లో 20 మంది.. అత్యల్పంగా ఉప్పల్, బార్కాస్, నవాబ్సాహెబ్కుంట, టోలీచౌక్, జీడిమెట్ల వార్డుల్లో ముగ్గురు అభ్యర్థులు చొప్పున పోటీ చేస్తున్నారు.
Tags :
జిల్లా వార్తలు