
తాజా వార్తలు
హైదరాబాద్కు నిర్మలా సీతారామన్
న్యూదిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండురోజుల పాటు హైదరాబాద్, బెంగళూరులో పర్యటించనున్నారు. ఆమె పర్యటనకు ఈ నెల 16, 17 తేదీలను ఖరారు చేశారు. బడ్జెట్లో ప్రభావితం కానున్న వర్గాలను ఆమె కలవనున్నారు. ‘‘ఆర్థిక మంత్రి ఈ నెల 16,17 తేదీల్లో అధికారికంగా హైదరాబాద్, బెంగళూరుల్లో పర్యటించనున్నారు. బడ్జెట్లోని వివిధ రంగాల భాగస్వాములతో ఈ సందర్భంగా ఆమె భేటీ కానున్నారు’’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్లో వెల్లడించింది.
ఈ రెండు నగరాల్లో తొలుత ఆమె వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు, రైతులతో మాట్లాడనున్నారు. ఇక రెండో సెషన్లో ఆర్థిక వేత్తలు, పన్ను ప్రాక్టిషనర్లు, విద్యావంతులు, విధాన కర్తలతో భేటీ కానున్నారు.
ఈ నెల 1వ తేదీన సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఈ బడ్జెట్ ప్రసంగమే అత్యంత సుదీర్ఘమైంది. దీనిలో ముఖ్యంగా వ్యవసాయం, నీటిపారుదల, నీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య రంగం, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.