
తాజా వార్తలు
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంలో విచారణ
దిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విభజన విషయంలో జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ విద్యుత్ సంస్థల తరఫున న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. ఆర్థిక సమతుల్యత అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ఉద్యోగుల కేటాయింపులు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ స్థానికత కలిగిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఉద్యోగల విభజన విషయంలో తొలుత జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన నివేదిక చట్టబద్ధతను తేలుస్తామని.. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను ఏపీ రిలీవ్ చేయడం సరైనదా? కాదా? అనేది నిర్ణయిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. నేటి విచారణలో తెలంగాణ విద్యుత్ సంస్థల పిటిషన్లపై వాదనలు ముగిసిన నేపథ్యంలో ఏపీ విద్యుత్ సంస్థల వాదనలు కొనసాగాల్సి ఉంది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- తాగడానికి తగని సమయముంటదా..!
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఆసీస్కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
