
తాజా వార్తలు
సీఎంపై వ్యాఖ్యలు.. బండి సంజయ్పై ఫిర్యాదు
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పార్థసారథిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంకులోని కార్యాలయంలో ఎస్ఈసీ పార్థసారథిని పల్లా కలిశారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ను దేశ ద్రోహి అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై వారు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రజలు, నాయకులను అవమానపరిచేలా మాట్లాడుతున్న సంజయ్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంజయ్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరినట్లు తెలిపారు.
‘‘ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సీఎంపై చిల్లరగా, వెకిలిగా మాట్లాడటం బండి సంజయ్కే చెల్లుతుంది. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయం ఏమాత్రం సరికాదు. తక్షణమే బండి సంజయ్ను అరెస్టు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలి. ఈ తరహాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సామరస్యంగా ఉన్న భాగ్యనగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు’’ అని ఎస్ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో నేతలు వివరించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- కన్నీటి పర్యంతమైన మోదీ
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- సికింద్రాబాద్లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
- రెరా మధ్యే మార్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
